Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీపై టీ మాస్ ఆగ్రహం ొఐలయ్యపై దాడికి ఖండన
- ఆ పార్టీ నేతలు లక్ష్మణ్, దత్తాత్రేయ సమాధానం చెప్పాలి
- ఐలయ్యకు వెంటనే రక్షణ కల్పించాలని డిమాండ్
- మతోన్మాద దిష్టిబొమ్మ దహనం ొనేడు రాజకీయ పార్టీలతో రౌండ్టేబుల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇప్పటిదాకా ఆర్యవైశ్యుల ముసుగులో దాడులు చేసిన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా ఆ ముసుగును తీసేసి బరితెగించి ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై హత్యాయత్నానికి తెగబడిందని తెలంగాణ సామాజిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక (టీ మాస్ ఫోరం) ఆగ్రహం వ్యక్తం చేసింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆయనపై జరిగిన దాడిని ఫోరం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పందించాలని డిమాండ్ చేసింది. వీరిరువురూ బీసీ నేతలని చెప్పుకుంటారు.. అలాంటప్పుడు ఒక బీసీపై దాడి జరిగితే ఎందుకు నోరు మెదపటం లేదని ఫోరం ఈ సందర్భంగా ప్రశ్నించింది. తక్షణం ఐలయ్యకు పూర్తి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేదంటే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు సంభవించినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఐలయ్యపై దాడిని ఖండిస్తూ గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీ మాస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ జాన్వెస్లీ, తెలంగాణ మేధావుల ఫోరం కన్వీనర్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు ఐలయ్యతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకూ ఐలయ్యపై ఆరెస్సెస్, ఆర్య వైశ్యులతో దాడి చేయించిన బీజేపీ.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగిందని వారు విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ఆ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. ఇలాంటి దాడులను ప్రజాతంత్రవాదులు, అభ్యుదయవాదులందరూ తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ చర్యలను నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్తోపాటు అన్ని జిల్లాల్లో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వివిధ రాజకీయ పార్టీలు పాల్గొంటాయని చెప్పారు. వీటిని జయప్రదం చేయటం ద్వారా బీజేపీ దుశ్చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో టీపీఎస్కే కన్వీనర్ జి.రాములు, టీ మాస్ ఫోరం రాష్ట్ర నాయకులు చంద్రన్న, శ్రీరాం నాయక్, కిల్లె గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఐలయ్యపై దాడిని నిరసిస్తూ టీ మాస్ నేతలు సుందరయ్య పార్కు వద్ద మతోన్మాద దిష్టిబొమ్మను దహనం చేశారు.
ప్రజాస్వామ్యం కుప్పకూలటం ఖాయం...
ప్రొఫెసర్ కంచ ఐలయ్య
'కోరుట్లలో బీజేపీ కండువాలు ధరించిన ఆ పార్టీ కార్యకర్తలు స్వయంగా నా కారుపై రాళ్లు రువ్వారు. కర్రలు, చెప్పులతో దాడికి దిగారు. దేశాన్ని పరిపాలించే పార్టీ ఒక సామాజికవేత్త పట్ల ఇలాగేనా వ్యవహరించేది..? ఇలాంటి అరాచకాలు మున్ముందు కొనసాగితే దేశంలో ప్రజాస్వామ్యం కుప్పకూలుతుంది. నేను రాసిన 'సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్లు' అనే పుస్తకంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత కూడా దాడులకు పూనుకోవటం శోచనీయం. పుస్తకాన్ని నిషేధించలేం, దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఉందంటూ తీర్పు సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇదంతా తెలిసి కూడా బీజేపీ దాడులకు పాల్పడుతున్నదంటే ఆ పార్టీకి కోర్టులు, న్యాయస్థానాలు, రాజ్యాంగం, పోలీసులపట్ల నమ్మకం, గౌరవం లేదనే విషయం తేలిపోయింది. ఆర్యవైశ్యుల గురించి పేర్కొంటూ తాను పుస్తకం రాస్తే ఆ విషయమై దాడులకు పాల్పడుతున్న బీజేపీ, దేశంలోని దళితులు, గిరిజనులు, బడుగు, బలహీనవర్గాలవారు, మైనారిటీలపై దాడులు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు..? ఈ విషయంలో ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు స్పందించాలి. లేదంటే రెండు రాష్ట్రాలకు బీజేపీ చర్యలు ప్రమాదకరంగా మారతాయి...''
పథకం ప్రకారమే... : జి.రాములు
'ఇదేదో మామూలుగా జరిగిన దాడి కాదు. పక్కా పథకం ప్రకారమే ఐలయ్యపై దాడికి దిగారు. పద్మావతి సినిమా విషయంలోనూ ఇలాగే దర్శకుణ్ని, కథా నాయికను బెదిరించారు.
మతోన్మాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో ప్రముఖ నటులు కమలహాసన్, ప్రకాశ్రాజ్ను కూడా లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. ఇలాంటి చర్యలను అభ్యుదయవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి...''