Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మంలో ఐటీ హబ్ పనుల పరిశీలన
- పొంగులేటి కుటుంబానికి పరామర్శ
నవతెలంగాణ-ఖానాపురంహవేలీ
ఖమ్మం ఐటీ హబ్ ఏర్పాటుతో జిల్లాల్లో ఐటీ విస్తరణకు తలమానికంగా నిలుస్తుందని నిజామాబాద్ ఎంపీ కె.కవిత అన్నారు. సోమవారం ఆమె ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న ఐటీ హబ్ పనులను ఎమ్మెల్యే అజరుకుమార్తో కలిసి పరిశీలించారు. ఐటీ హబ్ బ్లూ ప్రింట్స్ను తిలకించారు. అనం తరం ఎంపీ కవిత విలేకరులతో మాట్లాడుతూ.. ఐటీ మంత్రి కేటీఆర్ నేతత్వంలో జిల్లాలో ఐటీ విస్తరణ వేగంగా జరుగుతోందన్నారు. మరింత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే కతనిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆ తర్వాత ఖమ్మంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సందర్శించారు. ఎంపీ పొంగులేటి నివాసం కల్లూరు మండలానికి వెళ్తూ మార్యమధ్యలో వైరాలో కొద్దిసేపు పర్యటించారు. ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్తో కలిసి క్యాంపు కార్యాలయంలో కార్య కర్తలను కలిశారు. వైరా రిజర్వా యర్కు సీతారామా ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లొస్తాయని, మరో 80వేల ఎకరాలు సాగు లోకి వస్తాయని ఈ సంద ర్భంగా ఎంపీ కవిత చెప్పారు. వైరాలో మినీ ట్యాంక్ బండ్ కోసం రూ.5.60కోట్లు మం జూరైన సంగతి గుర్తు చేశారు. అనం తరం కల్లూరు మండలం నారాయణపురంలో ఎంపీ పొంగులేటి ఇంటికి వెళ్లారు. ఎంపీ తండ్రి రాఘవరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. పొంగులేటి సోదరు లను, తల్లిని పరామ ర్శించారు. ఆమె వెంట ఎమ్మె ల్యేలు పినపాక, అశ్వారావ ుపేట ఎమ్మెల్యేలు పాయం వెంక టేశ్వర్లు, తాటి వెంక టేశ్వర్లు, పలువురు కార్పొరేటర్లు ఉన్నారు.