Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వాహకులనూ అడ్డుకుంటున్న వైనం
- నిన్న నందిని సిధారెడ్డిని, నేడు గోరటి వెంకన్న
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
ప్రపంచ తెలుగుమహాసభల్లో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. రెండురోజుల క్రితం మహాసభల నిర్వాహకులు, తెలంగాణ అకాడమీ ఛైర్మెన్ నందిని సిధారెడ్డిని లోపలికి వెళ్లకుండా అడ్డుకోగా, తాజాగా సోమవారం ప్రముఖ వాగ్గేయకారులు గోరెటి వెంకన్నను అడ్డుకున్నారు. ఎల్బీస్టేడియం గేట్ నెంబర్ 1ద్వారా కొన్ని పుస్తకాలతో గోరటి వెంకన్న వచ్చారు. పుస్తకప్రదర్శన వైపు వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. మహాసభల గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి పంపిస్తామని చెప్పారు. దీంతో సివిల్ డ్రెస్లో ఉన్న ఆపోలీస్ను నువ్ పోలీస్ అని గ్యారంటీ ఏంటీ..? అని గోరటి ప్రశ్నించారు.దీంతో ఆ పోలీస్ అధికారి తాను సఫారీలో ఉన్నన్నాననీ, పైన చలికోటు ఉందని సమాధానమిచ్చారు.
వేరే మార్గం ద్వారా లోపలికి వెళ్లాలని గోరటిని కోరారు. దీంతో అక్కడే ఉన్నమీడియా ప్రతినిధులు కల్పించుకుని, గోరటి వెంకన్నను లోపలికి తీసుకుపోయారు. ఆదివారం గేట్ ఏ నుంచి వాహనంపై వచ్చిన ఓ మీడియా ప్రతినిధిని కూడా పోలీసులు అడ్డుకుని, వాహనం తాళం చెవి గుంజుకున్నారు. తాగి సభలకు వస్తున్నారని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉన్న జర్నలిస్టులు ఆందోళ నకు దిగారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు.