Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సర్కార్ కొత్తగా తెచ్చిన భూసేకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సోమవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ రాష్ట్ర భూ సేకరణ చట్టం- 2017 ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉందని, ఈ చట్టం రైతులు, కూలీల హక్కులు హరించేలా ఉందని, దీన్ని కొట్టివేయాలని కోరుతూ మెదక్ జిల్లాకు చెందిన మహ్మద్ హయాతుద్దీన్ రిట్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథ్, న్యాయమూర్తి శ్యాంప్రసాద్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ వాదనతో కౌంటర్ దాఖలు చేయాలని బెంచ్ ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.