Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ కె.కేశవరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన పాటలు, మాట్లాడిన మాటలు.. అప్పుడు వినసొంపుగా అనిపించాయని రాస్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. అయితే ఇప్పుడు వాటిలో కొన్నింటిని వింటే సిగ్గుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలుగు మహాసభల్లో భాగంగా సోమవారం రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'వచ్చిండ్రు.. పోయిండ్రు.. అనే పదాలు అప్పుడు బాగా నచ్చినయి. అదే విధంగా అన్ని పదాలకు ఉండ్రు అనే పదాన్ని జోడించి మాట్లాడినం. అప్పుడు బాగనే ఉంది. కానీ ఇప్పుడు అవే పదాలను వింటుంటే సిగ్గనిపిస్తది...ఆ ఉద్యమ ఊపు నుంచి మనం ఇప్పుడు బయటపడాలె...' అని సూచించారు. మాట్లాడే భాషకు, రాసే భాషకు తేడా ఉంటుందని చెప్పారు. ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకుని.. పత్రికా భాషను ప్రామాణికం చేయాలని కెకె ఈ సందర్భంగా సూచించారు.