Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులుగా సూర్యాపేట జల్లాకు చెందిన చిలకరాజు రాములు, ఉపాధ్యక్షులుగా వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన కోకల సోమశేఖర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆది, సోమవారాల్లో వరంగల్ జిల్లా హన్మకొండలో ఎ నర్సిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం సాయంత్రం ముగిశాయి. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న ఎ నర్సిరెడ్డి 2018 ఆగస్టులో ఉద్యోగవిరమణ చేయనున్నారు. ఉపాధ్యక్షులుగా ఉన్న మాణిక్రెడ్డి రిటైరయ్యారు. నర్సిరెడ్డి, మాణిక్రెడ్డిలు రాష్ట్ర కార్యదర్శులుగా ఆఫీస్ బేరర్లలో కొనసాగుతారు. ఈ ఎన్నికల ప్రక్రియను సీనియర్ నాయకుడు ఎంఎకె దత్తు, ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షులు, ఎం సంయుక్త నిర్వహించారు.
నూతన అధ్యక్షునిగా ఎన్నికైన రాములు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ అభివద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి శక్తిమేరకు క షిచేస్తానన్నారు. నూతన పిఆర్సీ కమిటీని నియమించాలని, సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, గిరిజన సంక్షేమ, ఎయిడెడ్, కెేజీబీవీ, మోడల్ స్కూల్స్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, సర్వీసు నిబంధనలకు గల ఆటంకాలను తొలగించి విద్యారంగంలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కేజీ తరగతులు, సమాంతరంగా ఆంగ్లమాధ్యమం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాలను ఆమోదించారని ప్రధాన కార్యదర్శి చావ రవి తెలియజేశారు.