Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఎంఆర్పీఎస్
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణ మాదిగపై తెలంగాణ ఎంఆర్పిఎస్ మండిపడింది. ఆయన స్వార్ధపరుడని విమర్శించింది. సొంత ప్రయో జనాల కోసమే మాదిగ జాతిని వంచిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు సోమవారం జరిగిన తెలంగాణ ఎంఆర్పిఎస్ సమావేశంలో అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతున్న మందకృష్ణను మాదిగ జాతి బహిష్కరించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. 23 ఏళ్లు గడిచినా.. ఉద్యమంలో మాదిగలకు కేసులు మిగిలాయే తప్ప.. ప్రయోజనం ఏమీ కలుగలేదన్నారు. మోత్కుపల్లి నర్సింహులుతో టిడిపి, సర్వే సత్య నారాయణతో కాంగ్రెస్ అంటూ.. మాదిగలను ఆయా పార్టీలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఎన్నికలప్పుడు రాజ్యాధికరమే లక్ష్యమనే మంద కష్ణ ఎన్నికలు ముగియగానే వర్గీకరణ అంటూ మాట్లాడుతారని విమర్శిం చారు. ఎస్సి వర్గీకరణకు కట్టుబడి ఉన్న సిఎం కెసిఆర్తో కలిసి పని చేస్తామన్నారు.