Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సర్కార్కు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మేడమడుగులో ఈనెల 14న జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలకు నిర్వహించిన శపరీక్ష వీడియో తమ ముందు ఉంచాలని హైకోర్టు ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర సర్కార్ను ఆదేశించింది. చండ్ర పుల్లారెడ్డి బాటదళ సభ్యులు తొమ్మిది మందిని పోలీసులు తీసుకువెళ్లి కాల్చి చంపారని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ పౌరహక్కుల సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. శవపరీక్ష వీడియో చిత్రీకరణ క్యాసెట్ను అందజేయాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి శ్యాంప్రసాద్ లతో కూడిన డివిజన్ బెంచ్ తెలంగాణ సర్కార్ను ఆదేశించింది. అమాయకులైన తొమ్మిది మందిని పోలీసులు కావాలని కాల్చి చంపారని, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం కింద కేసులు పెట్టాలని, ఈ ఎన్కౌంటర్లో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ పాత్ర కూడా ఉందని పిటిషనర్ తరపు నాయవాది రఘునాథ్ వాదించారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు లోబడే పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారని, దానికి సంబంధించిన వీడియో క్యాసెట్ను అందజేస్తామని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దేశారు ప్రకాష్రెడ్డికు బదులిచ్చారు.
హిందీ పట్టభద్రులకు
టీఆర్టీ పరీక్షకు అనుమతించండి
హిందీ (భషణ్, విధ్వాన్) పట్టభద్రులు సాధారణ హిందీ పట్టభద్రులతో సమన మైతే వారి దరఖాస్తులను స్వీకరించి ఉపా ధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కు అను మతించాలని హైకోర్టు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథ్, న్యాయమూర్తి శ్యాంప్రసాద్లతో కూడిన డివిజన్ బెంచ్ తెలంగాణ సర్కార్ను ఆదేశించింది.