Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమ తరిలొచ్చింది. ఈ సందర్భంగా ప్రముఖులందరినీ రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ ఘనంగా సన్మానించారు. పలువురు సినీచిత్ర నిర్మాతలు నిర్మించిన మూడు దృశ్య పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ పండుగలు బతుకమ్మ, హోళి పండుగలు, పాట చరిత్రను వీటిద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్తో పాటు సినీనటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మోహన్బాబు, బాలకృష్ణ, ఆర్ నారాయణమూర్తి, రాజేంద్రప్రసాద్, నిర్మల, జయసుధ, బ్రహ్మానందం, సుమన్, కోట శ్రీనివాస్, దర్శకులు రాఘవేంద్రరావు, రాజమౌళి, ఎన్ శంకర్, నిర్మాతలు దిల్రాజు, అశ్వినిదత్, తనికెళ్ల భరణి, తదితరులు పాల్గొన్నారు.
అలరించిన మలేషియా ఆటాపాటా
మలేషియా తెలుగు వారి సాంస్కృతిక కబంద కార్యక్రమం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇతర దేశాల్లో జీవిస్తున్న తెలుగు చక్కగా మాట్లాడారు. మలేషియాలో తెలుగు వారి చరిత్రతో పాటు భరతనాట్యం, కోలాటం, బతుకమ్మ ఆటలను ఆడారు.