Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువతను పెడతోవ పట్టిస్తున్న హబ్లను, పబ్లను మూసివేయించాలని సినీ నటులు ఆర్ నారాయణమూర్తి మంత్రి కేటీఆర్ను కోరారు. మ్యూజియంలో తెలుగు పెట్టే దుస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని భావించి, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు మహాసభలను నిర్వహించడం గొప్పవిషయమని చెప్పారు. 60 ఏండ్ల కాంగ్రెస్ కంచుకోటను కూల్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని, అంతంటి వ్యక్తి కేసీఆర్ అని, ఆయన ప్రధాని కావాలని ఆకాంక్షించారు. మునిగి పోతున్న పడవ మన తెలుగు భాష అని దర్శకులు రాఘవేంద్రరావు అన్నారు. దీన్ని నిలిపేందుకు కేసీఆర్, ఆయన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సినిమా పోస్టర్లపై తెలుగు మాట్లాడుకుందాం అనే పదాలను పెట్టాలని మంత్రి కేటీఆర్కు సూచించారు. తేటతేట తెలుగులా తెల్లవారి వెలుగులా తెలుగుభాష వెలుగాలని సినీహీరో నాగార్జున ఆకాంక్షించారు. ఎక్కడున్నా, ఏం చేసినా ఈ తెలుగు భాషను రక్షించుకుందామని సినీహీరో వెంకటేశ్ అన్నారు. వెలకట్టలేని సంంపద తెలుగు భాష అని తెలిపారు.