Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మెట్రో అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలన్న డిమాండ్తో పాటు కార్పొరేట్ ప్రయాణీకులకే పరిమితమైన మెట్రోరైలు ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ అన్నారు. సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్, ప్రయివేటు పార్టనర్ షిప్ (పీపీపీ) ప్రాజెక్టుగా దేశానికే తలమానికంగా రూపుదిద్దుకుంటుందంటూ ఊదరగొడుతున్న పాలకులు ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిమయంగా మార్చేశారని ఆరోపించారు. 2008లో మైటాస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న నాటి ప్రభుత్వం తదనంతరం పరిమాణాలతో మైటాస్తో తెగదెంపులు చేసుకుందన్నారు.2010లో అతి తక్కువ నిర్మాణ అంచనా (రూ.14,132 కోట్లు) వ్యయాన్ని ప్రకటించిన ఎల్అండ్టీతో నిర్మాణ ఒప్పందం జరిగిందన్నారు. 2012లో అంచనా వ్యయాన్ని రూ.17,952 కోట్లకు పెంచుకుందన్నారు. తాజాగా 2017 నవంబర్లో రూ.18,800 కోట్లకు పెంచి ఈ భారాన్నంతా ప్రజలపై మోపుతూ మెట్రో ప్రయాణమనేది కేవలం కార్పొరేట్, సాఫ్ట్వేర్ ఉద్యోగులకే పరిమితం చేసిందన్నారు. సామాన్యుడికి మెట్రో ప్రయాణం అందని ద్రాక్షగానే మిగిలిందని చెరుకు సుధాకర్ ఆరోపించారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణం ఆది నుంచి వివాదాలమయమేనన్నారు.
ప్రాజెక్టు నిర్మాణమం తా అవినీతిమయమేనంటూ అనేక మంది నిపుణులు, ఎన్జీఓలు, రాజకీయ పక్షాలు, ప్రజలు గగ్గోలు పెడుతున్నా కేంద్రా, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిసిగ్గుగా పరిస్థితులను కప్పిపుచ్చుతూ తమ అవనీతిని విస్తరించుకుంటూ వస్తున్నాయ న్నారు. మెట్రో రైలు ప్రాజెక్టులో తెలంగాణ యువతకు కొలువులు స్థానికులకే దక్కాలని ఆయన డిమాండ్ చేశారు.