Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ సర్కారుపై జైపాల్రెడ్డి గరం
- 20న జడ్చర్లలో జనగర్జన సభ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ప్రత్యేక సాధన కోసం సకల జనులు చేసి పోరాటాలు, నిరంతరం శ్రమించి ఉద్యమాలు చేసిన వ్యక్తులకు, శక్తులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పాలన కొనసాగుతుందని కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం లేదని, తెలంగాణ వచ్చిన నాలుగేండ్ల తర్వాత కూడా ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరముందని, అందులో భాగంగా 20న జడ్చర్ల జన గర్జన పేరుతో భారీ బహిరంగ సభ టీఆర్ఎస్ వ్యతిరేక శక్తుల ఐక్యతకు నాంది పలుకుతుందన్నారు. జడ్చర్ల జనగర్జన సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వత్తిదారులు కష్ట నష్టాల పాలవుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలిచ్చి మభ్య పెడుతూ రాజకీయ భ్రమలు కల్పించి కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, నిరుద్యోగులు ప్రాణాలు వదులుతున్నా, అవినీతి పెరిగిపోయినా కూడా కేసీఆర్ ఎలాంటి నివారణ చర్యలు తీసుకోకపోగా వాటికి వంత పాడే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ వారిని కుల వత్తులకు పరిమితం చేసి పాలనాధికారాలను తన చేతిలో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అవినీతి రాజ్యమేలుతుందని ముఖ్యమంత్రే స్వయంగా రాజకీయ ఫిరాయింపులను విచ్చలవిడిగా ప్రోత్సహించి ఒక అనైతిక పాలన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అప్పులు చేయడం తప్ప అభివద్ధి లేకుండా పోయిందన్నారు. ఉద్యమాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ నిరంకుశ, అవినీతి, అశ్రిత పక్షపాతం నుంచి కూడా కాపాడుకోవడానికి మరోసారి కేసీఆర్ వ్యతిరేక శక్తులంతా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవశ్యకత ఏర్పడిందన్నారు.