Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 3 లోగా పనులను ప్రారంభించాలి: నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశం
- సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
మిషన్ కాకతీయ నాలుగవ దశ పనులకు ఫిబ్రవరి 3 లోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఈ దశ పనుల్లో ఫీడర్ చానల్స్ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. మిషన్ కాకతీయ 4 వ దశ పై మంగళవారం సచివాలయం నుంచి ఆయన వీడియో కానారెేన్స్ నిర్వహించారు.ఏ రోజుకారోజు విధిగా వాట్సప్ లో పనుల ఫొటోలు పెట్టాలని కోరారు. ఫిబ్రవరి 3 వ తేదీన మళ్లీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని మంత్రి ప్రకటించారు. ఎట్టి పరిస్థితులలోనూ నిర్ణీత గడువులోగా పనులను ప్రారంభించాలన్నారు. మిషన్ నాలుగో దశ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను, వ్యవసాయ అధికారులను భాగస్వాములు చేయాలని ఆయన సూచించారు. నాలుగవ దశలో 5703 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని 4 వ చేపడుతున్నట్టు చెప్పారు.
మిషన్ కాకతీయ కింద చేపట్టనున్న పనులలో సాగునీటి వనరుల ఆయకట్టును స్థిరీకరణకు, అదనపు ఆయకట్టుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఎస్ఈ, ఈఈలు క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యటించాలని ఆదేశించారు.4 వ దశ లో చేపట్టనున్న చెరువుల జాబితాను ముందుగానే వ్యవసాయ అధికారులకు అందిస్తున్నందున పూడిక మట్టిని రైతులు వాడుకునే ముందు తప్పనిసరిగా పరీక్షించాలని ఆదేశించారు. గతంలో తెలంగాణలో కేవలం భూసార పరీక్ష కేంద్రాలు 9 మాత్రమే ఉండేవని ఇరిగేషన్ మంత్రి చెప్పారు. ఇప్పుడు ప్రతి మూడు గ్రామ పంచాయతీ లకు కలిపి ఒక సాయిల్ టెస్ట్ ల్యాబ్ ఉందన్నారు. మొత్తం 2,500 సాయిల్ టెస్ట్ ల్యాబ్లున్నట్టు తెలిపారు. పూడికతీత మట్టిలో ఉండే పోషకాలపై ప్రజలు, రౖతుల్లో చైతన్యం, అవగాహన తీసుకు రావాలనికోరారు. విలేకరుల సమావేశాలు జరిపి ప్రచారం చేయాలనికోరారు. వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలఅధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయలో ఇంకా సమర్ధంగా పని చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. పరిపాలనపరంగా ఆమోదించిన పనులకు సాంకేతిక అనుమతులిచ్చి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కోరారు. మిషన్ కాకతీయ రెండు, మూడో దశలలో చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు పూర్తయిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులలో జాప్యం చేయరాదన్నారు.