Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిసార్ట్ ఎండీనీ అరెస్ట్ చేసిన సీబీఐ
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
బ్యాంకులకు టోకరా వేసి ఆరు వందల కోట్ల రూపాయల రుణం పొందిన హైదరాబాద్ శివార్లలోని ఒక రిసార్ట్ ఎండీని సీబీఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం షామీర్పేట్లోని లియోసిన్ రిసార్ట్స్ ఎండీ చక్రవర్తి రాజు 11 బ్యాంకుల రూ.600 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుని తిరిగి చెల్లించలేదు. దీనిపై సదరు బ్యాంకులు చేసిన ఫిర్యాదు పై బెంగళూరులోని సీబీఐ ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు జరుపగా కేవలం 30 ఎకరాలభూమిని కలిగి ఉన్న రాజు అంతకు మించి ఆస్తులు ఉన్నట్టుగా తప్పుడు పత్రాలను సమర్పించి 11 బ్యాంకుల నుంచి ఇంత భారీ మొత్తంలో రుణాలను పొందినట్టు బయటపడ్డది.