Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల గ్రామంలో 2004లో ప్రభుత్వం సేకరించిన భూములుపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత రెవెన్యూ రికార్డుల్లో సంబంధిత సంస్థ పేరు ఉందని, అయితే అప్పటి నుంచి భూమి తమ స్వాధీనంలోనే ఉందని 25 ఎకరాలకు చెందిన రైతులు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి ఎమ్మెస్ రామచంద్రరావు విచారించి.. రెవెన్యూ రికార్డుల్లో రైతుల పేర్లు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.