Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, తహసీల్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు
- పలుచోట్ల ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం
- అధికారులకు వినతిపత్రాల అందజేత
నవతెలంగాణ యంత్రాంగం
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఆందోళన బాటపట్టారు. కలెక్టరేట్లను ముట్టడించారు. డివిజన్, మండల కేంద్రాల్లో ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాల యాల ఎదుట ధర్నాలు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అధికారులకు వినతిప త్రాలు అందజేశా రు. హైదరాబాద్లోని హయత్నగర్లో జరిగిన ఆందోళన లో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఆర్. సుధాభాస్కర్ మాట్లాడుతూ... దేశంలో వివిధ స్కీమ్లలో పని చేస్తున్న వారందరినీ కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం రూ.18వేలు ఇచ్చేవరకూ సంఘటితంగా ఉద్యమిస్తామ న్నారు. 45వ ఇండియన్ కాన్ఫరెన్స్ సిఫారసులను వెంటనే అమలు చేయాలన్నారు. స్కీమ్ వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు నెలకు రూ.3వేల పింఛన్ ఇవ్వాలన్నారు. ఈసీఐఎల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడు తూ..ప్రజలకు సేవలందిస్తున్న స్కీమ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. మెదక్లో ర్యాలీనుద్దేశించి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడు తూ...ఐసీడీఎస్లో నగదు బదిలీ అలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లా డుతూ...అచ్ఛేదిన్ అంటూ ప్రధాని మోడీ, బంగారు తెలంగాణ అంటూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వారిద్దరూ కార్మికులను పట్టించుకోవట్లేద న్నారు. దేశంలోని కోటి మంది స్కీమ్ వర్కర్లను ఉద్యోగు లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ కలెక్టరే ట్ ముట్టడినుద్దేశించి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.రమ మాట్లాడుతూ...ప్రభుత్వ పథకాల నిర్వహణను ప్రయివేటుకు అప్పగించే యోచనను పాలకులు ఉపసం హరించుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట 300 మంది కార్మికులు ధర్నా చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.మల్లికార్జున్ పాల్గొన్నారు. వరంగల్లో సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం నుంచి అర్బన్ కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన వెళ్లి ధర్నా చేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె యాదానాయక్ మాట్లాడారు. జనగామ, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మహబూబాబాద్, ప్రొఫె సర్ జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యా పేట, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల, వన పర్తి జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి ధర్నాలు చేశారు.