Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెటర్నరీ, గిరిజన యూనివర్సిటీలు : కడియం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే విద్యా సంవత్సరం నుంచి వెటర్నరీ, గిరిజన విశ్వవిద్యాలయాలను ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ ఏడాది జూన్ నుంచి తరగతులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం సచివాలయంలో వెటర్నరీ, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లా డుతూ వరంగల్ జిల్లాలోని మామునూరులో వెటర్నరీ కాలేజీలో దరఖాస్తులను స్వీకరించేందుకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామ న్నారు. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు కూడా మామునూరులోని పీవీ నర్సింహారావు వెటర్నరీ కళాశాలను సందర్శించారని చెప్పారు.