Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ నెలాఖరుకు జిల్లాల వారీగా భూగర్భ జల మట్టాన్ని నమోదు చేసిన రాష్ట్ర భూగర్భ జల శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. గత సంవత్సరం డిసెంబర్తో పోలిస్తే ఈ సంవత్సరం డిసెంబర్లో రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టంలో స్వల్పం క్షీణత కని పిస్తున్నది. సంవత్సర కాలంలో రాష్ట్రంలో సగటున 0.55మీటర్ మాత్రమే భూగర్భ జలమట్టం తగ్గిందని అధికారికి నివేదికలో పేర్కొన్నారు. డిసెంబర్ తర్వాత వర్షాలు పూర్తిగా తగ్గిపోవటంతో మే నాటికి రాష్ట్రంలో భూగర్భ జలమట్టం మరింత తగ్గిపోయే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. తాజాగా విడుదలచేసిన నివేదిక డిసెంబర్ చివరి నాటికి కావటంతో 24 గంటల ఉచిత విద్యుత్ ప్రభావం అప్పటికి కనిపించలేదు. జనవరి 1 నుంచి రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వటంతో ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.