Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు కోదండరెడ్డి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ రుణాలకు సంబంధించిన వడ్డీ మాఫీ ప్రభుత్వమే భరిస్తుందంటూ అసెంబ్లీ సాక్షిగా భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇప్పటికీ అమలు చేయలేదని కాంగ్రెస్ కిసాన్ విభాగం చైర్మెన్ కోదండరెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రకటించి రెండు నెలలు గడుస్తున్నా.. వడ్డీ మాఫీ చేయడం లేదన్నారు. రుణమాఫీ నాలుగు విడతలుగా ఇవ్వడంతోనే రైతుపై వడ్డీ భారం పడిందన్నారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది రైతులపై రూ.2500 కోట్ల భారం పడిందని చెప్పారు.బుధవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వడ్డీ భారం పడిన రైతుల జాబితాను అసెంబ్లీ స్పీకర్కు అందించినప్పటికీ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
హజ్ యాత్రికుల సబ్సిడీ రద్దు సరికాదు : ఫక్రుద్దీన్
కేేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే హజ్ యాత్రికుల సబ్సిడీని రద్దు చేసిందని కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఫక్రుద్దీన్ విమర్శించారు. హజ్ యాత్రికుల సబ్సిడీ కొనగిస్తూ ముస్లిం మహిళల సంక్షేమం కోసం కృషి చేయకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైందికాదన్నారు. బుధవారం గాంధీభవన్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉజ్మాషకీర్, నాయకులు అప్జలుద్దీన్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రద్దు చేసిన సబ్సిడీ మొత్తాన్ని ముస్లిం మహిళా సాధికారిత కోసం ఉపయోగిస్తామని చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు.