Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొట్లాడి తెచ్చిన తెలంగాణలో అందరికీ ఫలాలందాలి
- కష్టం ఒకరిది..ఫలితం ఇంకొకరిది
- వ్యవసాయానికి సమగ్ర విధానం తీసుకురావాలి : రైతు, నిరుద్యోగ గర్జన సభలో జేఏసీ చైర్మెన్ ప్రొ|| కోదండరామ్
నవతెలంగాణ- సదాశివపేటటౌన్
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజావ్య తిరేక పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ కాలగర్భంలో కలిసి పోవడం ఖాయమని టీజేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. ఉద్యమంలో పాల్గొనని వారిని సీఎం పక్కన చేర్చుకొని ఇష్టానుసారంగా పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బుధవారం నిర్వహిం చిన రైతు, నిరుద్యోగ గర్జన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడితే మన ఫలాలు మనకే దక్కుతాయని ఎందరో ప్రాణత్యాగం చేశారని అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో కష్టం ఒకరిది, ఫలితం ఇంకొకరిది అన్నట్టుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరికీ ఫలాలందాలని, రైతులు, నిరుద్యో గులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకు నేటికీ సరైన న్యాయం జరగడం లేదన్నారు. వ్యవసాయానికి సమగ్ర విధానం తీసుకొచ్చి ప్రత్యేకంగా రైతు కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ విడుతల వారీగా చేయడంతో వడ్డీ ఎక్కువై అప్పులు తీరడం లేదని చెప్పారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, వారే ధర నిర్ణయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో నిమ్జ్ పేరుతో రైతుల భూములు గుంజుకుని వారిని రోడ్డుపాలు చేశారన్నారు. భూములు కోల్పోయిన రైతులకు జేఏసీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా కన్వీనర్ బీరయ్యయాదవ్, జిల్లా చైర్మెన్ అశోక్కుమార్, ఉస్మానియా జేఏసీ కన్వీనర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.