Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాహనాలపైకి దూసుకొచ్చిన వైనం
- ఇద్దరు మృతి ..మరో మహిళకు తీవ్రగాయాలు
- రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు ధ్వంసం
- హైదరాబాద్ వనస్థలిపురం ఘటన
నవతెలంగాణ-వనస్థలిపురం
జాతీయ రహదారిపై హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఇసుక టిప్పర్ బుధవారం బీభత్సం సృష్టించింది. సిగల్ దగ్గర దూసుకొచ్చిన టిప్పర్ రెండు ద్విచక్ర వాహనాలను, నాలుగు ఆటోలను బలంగా ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. వనస్థలిపురం పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా శ్రీనాథపురం నుంచి భార్యాభర్తలు సునీల్, రాధ, వారి కుమారులు మహేష్(7), మనీష్(4) ద్విచక్ర వాహనంపై మీర్పేటకు వస్తున్నారు. వనస్థలిపురంలోని సుష్మ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగల్ పడటంతో ఆగారు. ఈ సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఇసుక టిప్పర్ ఆగి ఉన్న వాహనాలను ఢకొీట్టి బీభత్సం సృష్టించింది. దీంతో సునీల్ కుమారుడు మహేష్, మరో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడు నరేష్(25) అక్కడికక్కడే మృతిచెందారు. సునీల్ భార్య రాధకు తీవ్ర గాయాలయ్యాయి. మనీష్కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్థారించారు. కేసు దర్యాప్తులో ఉంది.