Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వివిధ అంశాలపై అసెంబ్లీ సచివాలయం నియమించిన శాసనసభ, శాసన మండలి స్థాయి కమిటీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం మైనార్టీ కమిటీ చైర్మెన్ ఎండీ షకీల్ నేతృత్వంలో మైనార్టీల సమస్యలపై తెలుసుకునేందుకు వరంగల్ జిల్లాకు బయలుదేరుతున్నది. వ్యవసాయం, సహకార సంఘాలు, పశుసంవర్థక శాఖపై చర్చించేందుకు ప్రజా పద్దుల సంఘం చైర్మెన్ జే గీతారెడ్డి అధ్యక్షతన సోమవారం సమావేశం కానుంది. 25న అసెంబ్లీ ఆస్యూరెన్స్ కమిటీ, 27న మండలి అస్యూరెన్స్ కమిటీ సమావేశం, వెనకబడిన తరగతుల కమిటీ చైర్మెన్ వి గంగాధర్గౌడ్ అధ్యక్షతన 31న ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సీటీని సందర్శించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.