Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లోని ఆంద్రా వాళ్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడే పన్నులు చెల్లిస్తే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత బావుంటుందన్న నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ రాజీవ్కుమార్ వ్యాఖ్యలు అర్థరహితమని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. రాజీవ్ కుమార్ మాటలకు అర్ధం పర్ధం లేదని, ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించి కార్పొరేట్ ఆస్పత్రులు దోచుకుంటున్నాయని చెప్పారు. ఆస్పత్రుల అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.