Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల సేవకులుగా పోలీసులు
- సిబ్బందికి టెక్నాలజీతో పాటు నైపుణ్యంపై శిక్షణ: డీజీపీ మహేందర్రెడ్డి
నవతెలంగాణ-కంఠేశ్వర్/సంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్రమంతా ఒకేవిధమైన సేవలు, ఫ్రెండ్లీపోలీసింగ్ అమలు చేస్తామని డీజీ పీ మహేందర్రెడ్డి అన్నారు. ప్రజలకు సేవకులుగా పోలీసులు ఉండాలన్నదే పోలీ సుశాఖ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. శుక్రవారం ఆయన నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించారు. సమీక్షా సమావేశాలు జరిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసులు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్టేషన్లలో ఒకటే తరహా సేవలు ప్రజలకు అందేవిధంగా పోలీసులు పని చేయాలని సూచించారు. ఆధు నిక టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకెళ్లాలన్నారు. పని పద్ధతుల్లో మార్పు లు తీసుకొచ్చి పోలీసుల నైపుణ్యతను పెంచే విధంగా ఓ ప్రత్యేకమైన ప్లాన్తో పోలీసుశాఖ ముందుకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని భద్రతకు నిలయంగా మార్చడమే తమ లక్ష్యం అని డీజీపీ అన్నారు. వచ్చే ఏడాది గ్రేడింగ్ల్లో అన్ని శాఖ ల్లోకెలా పోలీసు శాఖను ప్రథమ స్థానంలో నిలపడమే తమ లక్ష్యన్నారు. పోలీసు శాఖలోని అధికారులు, సిబ్బందికి టెక్నాలజీ వినియోగంపై శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.