Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ, ఎస్టీ జాతీయ సదస్సులో మంత్రి జగదీశ్రెడ్డి
- ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.4004 కోట్ల సబ్సిడీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత లక్ష మంది దళిత నిరుద్యోగ యువతకు ఎకనామికల్ సపోర్ట్ కింద రుణాలు అందించామని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. అదేవిధంగా ఔత్సాహిక ఎస్సీ పారిశ్రామికవేత్తల కోసం రూ.4004 కోట్ల సబ్సిడీ విడుదల చేసిందన్నారు. దళిత రైతుల కోసం 100 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్తో పాటు, ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అత్యంత ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని బేగంపేటలో ఎస్సీ, ఎస్టీ హబ్ జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 500 పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఎస్సీలంతా ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారని వెల్లడించారు. అవకాశమిస్తే మాకు ఆకాశమే హద్దు అని దళిత విద్యార్థులు పూర్ణ, ఆనంద్ నిరూపించారన్నారు. చదువే అన్నింటికి మూలమని, దళితుల విద్యాభ్యాసం నిరంతరంగా కృషి చేస్తామని తెలిపారు.
ఎస్సీ గురుకులాలకు ఎస్సీ పారిశ్రామికవేత్తల ఉత్పత్తులు
ఎస్సీ పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించడానికిగాను ఎస్సీ పారిశ్రామికవేత్తలు తయ్యారు చేస్తున్న ఉత్పత్తుల్లో ఎస్సీ గురుకులాలకు అవసరమైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ఈ సదస్సులో ఎస్సీ సంక్షేమ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రసాద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.