Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ దేశ రెండో రాజధానిపై చర్చ జరగాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆంధ్రా పెట్టుబడుదారులు ఇప్పుడు ముఖ్యమంత్రి పంచన చేశారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆంధ్రా ప్రాంతానికి చెందిన సామాన్య జనం వలస పోతే...సినీ కథానాయకులతో సీఎం సన్మానం చేయించుకున్నారని విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో దేశ రెండో రాజధానిని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి సీఎం మర్చిపోయారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్వన్ స్టేట్ అంటూ ఒక ఇంటర్వూలో కేసీఆర్ చెప్పిన విషయాలన్నీ అబద్ధాలేనన్నారు. గొర్ల కొనుగోళ్లలో అవినీతి జరిగితే సీఎం గొప్పగా చెప్పడం సిగ్గుచేటన్నారు.