Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిజ్ఞాస కార్యక్రమంలో నరహరిశాస్త్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాస్త్రవేత్తలకు వయసుతో పనిలేదని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్టియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) శాస్త్రవేత్త నరహరిశాస్త్రి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో డిగ్రీ విద్యార్థుల రాష్ట్రస్థాయి అధ్యయన నివేదికల సమర్పణ పోటీల కార్యక్రమం జిజ్ఞాసలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరినైనా జిజ్ఞాస మాత్రమే సుదీర్ఘకాలం నిత్యనూతనంగా నిలబెడుతుందని చెప్పారు. సమాజ మేలు కోసం పరిశోధనలు చేయడమే శాస్త్రవేత్తల లక్ష్యమని అన్నారు. రెండో రోజు శుక్రవారం రసాయనశాస్త్ర విభాగానికి చెందినవి సాంకేతిక విద్యాభవన్లో, భౌతిక శాస్త్రానికి చెందిన అధ్యయన నివేదికలు జేఎన్ఏఎఫ్ఏయూలో విద్యార్థులు ప్రదర్శించారు. రసా యన శాస్త్ర విభాగంలో 28 అధ్యయన నివేదికలు, భౌతికశాస్త్రంలో 24 అధ్యయన నివేదికలను విద్యార్థులు సమర్పించారు. ఐఐసిటీ సీనియర్ శాస్త్రవేత్త మనోరమ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా ఓయూ నుంచి గూడూరు ప్రసాద్, పివి అనంతలక్ష్మి, పద్మావతి, ఐఐటీ హైదరాబాద్ నుంచి సూర్యనారా యణమూర్తి, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ వి జగదీశ్వర్, జిజ్ఞాస సమన్వయకర్తలు నాన్సీసెరెనా, జె నీరజ, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు.