Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళన బాట పట్టిన విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)లో పలు కోర్సులకు భారీగా ట్యూషన్ ఫీజులు పెరిగాయి. ఏకంగా 25శాతం నుంచి వందశాతం వరకూ పెంచుతూ వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఫీజులను తగ్గించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఎంఎస్డబ్ల్యూ, ఎంసీఏకు గతేడాది ఒక్కో సెమిస్టర్కు రూ.750 ఫీజు ఉంటే, ఈ సంవత్సరం రూ.1500లకు పెంచారు. ఎంబీఏకు రూ.3500 నుంచి రూ.4వేలకు, జేఎంసీ రూ.500, బీటెక్, ఎంటెక్ కోర్సులకు రూ.వెయ్యి, బీఎస్సీ కోర్సుకు రూ.250, డీఈడీకి రూ.200 చొప్పున ఫీజులు పెంచారు. ఫీజుల పెంపును నిరసిస్తూ శుక్రవారం మనూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తరగతులను బహిష్కరించి ఆందోళన చేశారు. వర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజులు తగ్గించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.