Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30,000 ఎకరాలకు సాగునీరు లక్ష్యం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని 30,000 ఎకరాలకు సాగునీరందించే రామప్ప-ములుగు ఘనపురం చెరువుల ఫీడర్ చానల్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి అవసరమైన రూ. 17.58 కోట్లు మంజూరు చేస్తూ నీటిపారుదల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు ఘనపూర్ చెరువు నుంచి వంగపల్లి చెరువుకు, అక్కడి నుంచి ఘనపురం చెరువుకు కలిపే ఫీడర్ చానల్ ద్వారా 26,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు, ములుగు ఘనపురం చెరువు కింద 3,500 ఎకరాలు, వంగపల్లి చెరువు కింద 500 ఎకరాలు స్థిరీకరణకు ఫీడర్ ఛానల్ ద్వారా నీరందుతుందని నీటిపారుదల శాఖ తెలిపింది. ఈ పనుల కోసం టెండర్లు పిలవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.