Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెండా ఊపి ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉస్మానియా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన మొబైల్ డెంటల్ హాస్పిటల్ను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. శుక్రవారం నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో వాహనాన్ని జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక డెంటల్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ మొబైల్ డెంటల్ హాస్పిటల్ వాహనం మారుమూల గ్రామాలకు పంపించి డెంటల్ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. వాహనంలో రెండు డెంటల్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయన్నారు. ఏసీ సదుపాయం ఉందని, ఇద్దరు డాక్టర్లు, సిబ్బంది పరికరాలు మందులు వంటివి వాహనంలోనే ఉంటాయన్నారు. చాలా మంది గ్రామీణులు ఆరోగ్య సమస్యలు విషమించే దాకా పట్టించుకోవడం లేదన్నారు.