Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ చైర్మెన్ సోమారపు సత్యనారాయణ
- సొంత వాహనాల వాడకం తగ్గించాలి : బి.జనార్దన్రెడ్డి
- సెమినార్ నిర్వహణ అభినందనీయం : పి.రవిశంకర్
నవతెలంగాణ - సిటీబ్యూరో
రోడ్లపై ప్రజా రవాణాకు ప్రత్యేక లైన్ కేటాయించాలని రాష్ట్ర ఆర్టీసీ చైర్మెన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా)- ఐఈఐ టీఎస్స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో 'పట్టణ ప్రాంతాల్లో రవాణా ఆధారిత అభివృద్ధి' అంశంపై జాతీయ సెమినార్ జరిగింది. దీనికి ఐఈఐ టీఎస్సీ చైర్మెన్ ఎస్.సత్యనారాయణ అధ్యక్షత వహించారు. హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ.. విదేశాల్లో మాదిరిగా మన దేశంలోనూ రోడ్లపై ప్రభుత్వ రవాణా వేగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో ఇటు ప్రభుత్వం, అటు ప్రజల ఆలోచనల్లో మార్పుల రావాలని అన్నారు. రోడ్లపై నడుస్తున్న దాదాపు 90 శాతం వాహనాల్లో ఒక్కరు లేక ఇద్దరే ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి, అత్యవసర సమయాల్లో జనజీవనానికి ఇబ్బందులు ఏర్పడుతు న్నాయని అన్నారు. 40 కార్లలో ప్రయాణించే వారు.. ఒక్క ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించొచ్చని చెప్పారు. ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులుంటే నాలుగు వాహనాలను ఉపయోగిస్తున్నారని, దీంతో రోడ్లపై ప్రజా రవాణాకు ఆటంకాలు ఎదురవుతు న్నాయని వివరించారు. రాష్ట్రంలో 10 వేల 500 ఆర్టీసీ బస్సులున్నాయని, ఇందులో నగరంలోనే దాదాపు 3,800 బస్సులు తిరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రవాప్తంగా రోజుకు దాదాపు 36 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు. అయితే, ఆర్టీసీ బస్సులు గంటకు నగరంలో 14 కిలోమీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 30 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయని తెలిపారు. చాలామంది సొంత వాహనాలు, ఇతర ప్రయివేటు రవాణాను ఆశ్రయిస్తుండటంతో రాష్ట్ర ఆర్టీసీ రూ.400 కోట్ల నష్టాల్లో ఉందని వెల్లడించారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించాలంటే స్పీడ్ పెంచడంతోపాటు, జాతీయ రహదారులు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక లైన్ కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే దాదాపు 40 బ్యాటరీ ఆధారిత బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటుం దని తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు సొంత వాహనాల వాడకం తగ్గించాలని సూచించారు. దోశ తినేందుకు కూడా దిల్సుఖ్నగర్ నుంచి చాలామంది పాతబస్తీకి పోతున్నారని, దీంతో ఉదయమే రోడ్లపై ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడుతోందని అన్నారు. అదేవిధంగా, స్వచ్ఛ సర్వేక్షణ్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్న వారికి రూ.లక్ష బహుమతిని జీహెచ్ఎంసీ అందిస్తుందని చెప్పారు. ఎల్అండ్టీ మెట్రో రైలు (హైదరాబాద్) లిమిటెడ్ ప్రాజెక్ట్ కంట్రోల్, అండ్ కాన్ట్రాస్ట్ జనరల్ మేనేజర్ పి.రవిశంకర్ మాట్లాడుతూ.. రవాణా ఆధారిత అభివృద్ధిపై జాతీయస్థాయి సెమినార్ నిర్వహించడం అభినందనీయమన్నారు. మెట్రో రైలుతో నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. మహానగ రంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మెట్రోరైలు, ఇతర సంస్థలు తగిన ప్రతిపాదలు చేసి ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. మెట్రో రైలు స్టేషన్లు ఉన్న ప్రాంతాలకు ఇతర ప్రభుత్వ రవాణా సేవలను అనుసంధానం చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. చాలా ప్రయివేటు సంస్థలు సొంత ఖర్చులు, సబ్సిడీలతో ఉద్యోగులకు ప్రయివేటు వాహన సౌకర్యం కల్పిస్తున్నాయని, ఈ విధానానికి చెక్ పెట్టాలంటే.. ప్రభుత్వ రంగ సంస్థలు ఆధునిక పద్ధతులతో మెరుగైన రవాణా సేవలందించే విధంగా ఆలోచించాలని సూచిం చారు. అంతకుము ందు ఐఈఐ, టీఎస్సీ గౌరవ సెక్రెటరీ జి.రామేశ్వర్ రావు స్వాగతోపన్యాసం చేశారు. ఐఈఐ టీఎస్సీ ప్రజల అవసరాలు, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనేక అంశాలపై అంతర్జాతీయ, జాతీయ సెమినార్లు నిర్వహిస్తోందన్నారు.