Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఈటల
- మరింత ఎదగడానికి పారిశ్రామికవేత్తలు కృషి చేయాలి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని, రాష్ట్రం మరింత ఎదగడానికి పారిశ్రామికవేత్తలు కృషి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించి పారిశ్రామిక రంగానికే కాకుండా, వ్యవసాయానికి కూడా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రక్షణ రంగ పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారిందని చెప్పారు. హైదరాబాద్లోని హౌటల్ తాజ్ డెక్కన్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కాంపొసిట్ మ్యానుఫ్యాక్చరర్ అప్లికేషన్ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన కన్న ముందు రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారమవుతుందంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. కాని ఆ సమయంలోనే పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేయాలంటూ పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. కాని తమ ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి, పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. పారిశ్రామికరంగంలో రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడుతున్నదని తెలిపారు. హైదరాబాద్లో కాంపోసిట్ పరిశ్రమతో వెయ్యి చిన్న పరిశ్రమలు అల్లుకుని ఉన్నాయని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 123 ఎకరాల స్థలాన్ని ఇబ్రహింపట్టం వద్ద కేటాయించిదని తెలిపారు. అయితే మన ముందు నిరోద్యగ సమస్య ఒక సవాల్గా నిలిచిందన్నారు. పారిశ్రామికవేత్తలు సహకరించి నిరుద్యోగాన్ని పారద్రోలడానికి తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో టీఎస్ఐఐసీ వీసీ అండ్ ఎండీ నరసింహారెడ్డి, సతీష్రెడ్డి పాల్గొన్నారు.