Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేమ పేరుతో కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహం
- మద్దతు తెలిపిన వివిధ పార్టీల నాయకులు
నవతెలంగాణ-తాండూరు
కందులు కోనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా తాండూరు రైతు బజార్ గేటు ఎదుట రైతులు శుక్రవారం రాస్తారోకో చేశారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీనిచ్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. తాండూరు డీసీఎంఎస్ మేనేజర్ వచ్చి కందులు కొనుగోలు చేసే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడుతామని హామీనివ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కంది కొనుగోలు కేంద్రాల్లో మార్క్ఫెడ్, డీసీఎంఎస్ అధికారులు కుమ్మక్కై తేమ శాతం అధికంగా ఉందనే సాకుతో కొనుగోలు చేయడం లేదన్నారు. తేమ శాతం కొలిచే యంత్రాల ద్వారా తమను మోసం చేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కంటే బ్రోకర్లకే అధికారులు సహకరిస్తున్నారని చెప్పారు. డీసీఎంఎస్ అధికారులు వచ్చి స్పష్టమైన హామీనిచ్చేంత వరకూ రాస్తారోకో విరమించేది లేదని భీష్మించారు. తాండూరు డీసీఎంఎస్ మేనేజర్ షరీఫ్ అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు. కందులు కొనుగోలు చేసే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడుతామని హామీనివ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.