Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండున్నరేండ్లలో 1.64 లక్షలు
- ఏటా10 శాతం రీప్లేస్మెంట్
- నాణ్యతపై సందేహాలు
- నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు
- ఓవర్లోడ్ పేరుతో తప్పించుకుంటున్న కంపెనీలు
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయి. ఒకటి...రెండు కాదు... ఏకంగా లక్షల్లో
పేలుతున్నాయి. 2015-16 నుంచి వరుసగా రెండున్నరేండ్లలో అక్షరాలా 1,63,999 ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. వాటిస్థానంలో అవే కంపెనీలకు చెందిన కొత్త ట్రాన్స్ఫార్మర్లను రీప్లేస్ చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. పెద్ద మొత్తంలో పేలుతున్న ట్రాన్స్ఫార్మర్ల తయారీ నాణ్యతపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. రికార్డుల్లో ఉన్న రోలింగ్ స్టాక్కు, ఆయా మరమ్మతు కేంద్రాల్లో ఉన్న స్టాకుకు మధ్య భారీ అంతరం ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
* ఎస్ఎస్ఆర్ శాస్త్రి
రాష్ట్రంలో 24గంటల విద్యుత్ సరఫరాను ఈ ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభించారు. దీంతో ట్రాన్స్ఫార్మర్ల పేలుళ్లు మరింత అధికం అయ్యాయి. అంతకుముందు కాలంలోనూ ఏటా దాదాపు 10 శాతం పేలుతున్నాయి. కేవలం కొన్ని కంపెనీలకు చెందిన ట్రాన్స్ఫార్మర్లను మాత్రమే అధికారులు నామినేషన్ పద్ధతిలో తీసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల వ్యవహారంలో భారీ అవినీతి జరుగుతోందని కొందరు విద్యుత్శాఖ ఉద్యోగులు బాహటంగానే వ్యాఖ్యానిస్తుండటం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. గతంలో టెండర్ల ద్వారా ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేసేవారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చెందిన కంపెనీల నుంచి రిజర్వేషన్ కేటగిరిలో విద్యుత్ ఉపకరణాలను తప్పనిసరిగా కొనుగోలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ వాటిని డిస్కంలు అమలు చేయట్లేదు. గతంలో టెండర్లు ముగిసిన కంపెనీల నుంచే నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు జరుపుతున్నాయి. 2015-16 నుంచి 2017-18 (సెప్టెంబర్ వరకు) డిస్కంలు అధికారికంగా ఇచ్చిన లెక్కల ప్రకారం రెండున్నరేండ్లలో రాష్ట్రంలో 1,63,999 ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో...
2015-16లో తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలోని ఉమ్మడి ఐదు జిల్లాల్లో 31,267 ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. వీటిలో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 8,845 ఉండగా, త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 22,422 ఉన్నాయి. 2016-17లో వీటి సంఖ్య 40,199కి పెరిగింది. వీటిలో సింగిల్ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 9,466 ఉంటే...త్రీఫేజ్ ట్రాన్స్పార్మర్లు 30,733 ఉన్నాయి. 2017-18 (సెప్టెంబర్ నెల వరకు) 15,693 ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. వీటిలో సింగిల్ ఫేజ్ 3,233 కాగా, త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 12,460 ఉన్నాయి. మొత్తంగా రెండున్నరేండ్లలో 87,159 ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఇదే ఏడాది అక్టోబర్ నుంచి జనవరి వరకు దాదాపు ఐదు వేలకు పైగా ఫిర్యాదులు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా.
టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో....
తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) పరిధిలో 2015 నుంచి 2017 సెప్టెంబర్ వరకు రెండున్నరేండ్లలో 76,840 ట్రాన్స్ఫార్మర్లు పేలిపో యాయి. ఇక్కడ కూడా త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లే అత్యధికంగా పేలి పోయాయి. 2015-16లో 28,031 ట్రాన్స్ఫార్మర్లు పేలి పోతే...వాటిలో సింగిల్ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 5,544 కాగా, త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 22,487 ఉన్నాయి. 2016-17లో ఈ సంఖ్య 32,360కి పెరిగింది. వీటిలో సింగిల్ఫేజ్ ట్రాన్స్పార్మర్లు 4,471 ఉండగా, త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 27,889 ఉన్నాయి. 20 17-18 (సెప్టెంబర్ వరకు) 16,449 ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. వీటిలో సింగిల్ఫేజ్ 2,779 కాగా, త్రీఫేజ్ 13,680 ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆరునెలల కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఓవర్లోడ్తోనే...
పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో డిస్కంలు కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నాయి. సహజంగా ట్రాన్స్ఫార్మర్ తయారీ కంపెనీలు మూడేండ్ల వారంటీ మాత్రమే ఇస్తాయి. పేలుతున్న ట్రాన్స్ఫార్మర్లలో అత్యధికం వారంటీ గడువులో ఉంటున్నవే కావడం గమనార్హం. అయితే కంపెనీలు వారంటీ ఇచ్చేందుకు కూడా కొన్ని షరతుల్ని విధించాయి. విద్యుత్ సరఫరా ఓవర్లోడ్ అయినా, లోడింగ్ అన్లోడింగ్లో డామేజ్ అయినా, పక్షులు వాటిపై వాలి షార్ట్సర్క్యూట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే తమ బాధ్యత కాదని ఆ షరతుల్లో ఉన్నాయి. కేవలం ఉత్ప త్తి లోపాలు (మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్) ఉంటేనే వారంటీ వర్తిస్తుంది. అయితే అత్య ధిక శాతం ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్తోనే కాలిపోయినట్టు రికార్డుల్లో నమో దవుతు ండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో కంపెనీలు బాధ్యత తీసుకో వాల్సిన అవసరం లేకుండా పోతోంది. ఇవి కాలిపోయాక, అదే కంపెనీల నుంచి రోలింగ్స్టాక్ పేరుతో మళ్లీ కొత్త ట్రాన్స్ఫారాలకు కొనుగోలు చేస్తుండటం గమనార్హం.