Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవీంద్రభారతి స్కూల్ ప్రభంజనం
హైదరాబాద్: సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన 20వ నేషనల్ సైన్స్ ఒలింపియాడ్-2017 తొలి దశ ఫలితాల్లో రవీంద్ర భారతి స్కూల్స్ విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 135 మంది విద్యార్థులు రెండో దశకు అర్హత సాధించారని రవీంద్రభారతి స్కూల్స్ చైర్మెన్ ఎం సుబ్రహ్మణ్యం(మణి) తెలిపారు. దాంతోపాటు 83 మంది విద్యార్థులు బంగారు, 43 మంది వెండి, 32 మంది కాంస్య పతకాలు సాధించారని చెప్పారు. అంతేకాక, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లోనూ రవీంద్రభారతి విద్యార్థులు కదం తొక్కారని తెలిపారు. 133 విద్యార్థులు రెండో దశకు ఎంపికయ్యారని తెలిపారు. 147 మంది విద్యార్జులు బంగారు, 61 మంది వెండి, 48 మంది కాంస్య పతకాలు సాధించి రవీంద్రభారతి ప్రాముఖ్యతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే స్కూల్ స్థాయి పోటీ పరీక్షలో రవీంద్రభారతి నిరంతరాయంగా విజయ ప్రస్థానం కొనసాగిస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు.