Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పోర్ట్స్కోటాలో మెడికల్ సీట్ల వ్యవహారం
- అక్రమార్కులకు ప్రభుత్వ పెద్దల అండ!
- విచారణ పేరుతో కాలయాపన
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ఏ శాఖలోనైనా ఉద్యోగులు తప్పుచేసినట్టు తేలితే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటారు. కానీ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. తప్పుచేసినట్టు ఒప్పుకున్నా...చర్యలకు మాత్రం ససేమిరా అంటున్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. క్రీడాకోటా మెడికల్ సీట్ల వ్యవహారంలో అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2017-18 విద్యాసంవత్సరానికి గానూ స్పోర్ట్స్ కోట మెడికల్ సీట్లలో అక్రమాలు జరిగినట్టు ఒక్కొక్కటి బయటి కొస్తున్నాయి. క్రీడాకోటలో పది సీట్లలో ఇప్పటికీ రెండుసీట్లలో గోల్మాల్ జరిగినట్టు ఆధారాలున్నాయి. వీటికితోడు ఈసారి ముగ్గురు అంతర్జాతీయ క్రీడాకారులనూ కావాలనే పక్కనపెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ప్రతిభ ఉంటే కాదు..పైసలుంటేనే' శీర్షికతో నవతెలంగాణ జనవరి ఒకటిన కథనం ప్రచురించింది. స్పందించిన అధికారులు ఇద్దరు అధికారులతో విచారణ చేయించారు. ఓ విద్యార్థినికి ప్రాధాన్యత పాయింట్లు వేయడంలో తప్పిదం జరిగినట్టు కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. విచారణ అధికారులూ పనిఒత్తిడి, సమయం తక్కువగా ఉండటంతోనే ఈ తప్పిదం జరిగినట్టు చెప్పినట్టు తెలిసింది. నివేదిక ఇచ్చి దాదాపు నెలరోజులు దాటింది. అయినా ఇప్పటికీ ఆ సర్టిఫికెట్ట అధికారులపై చర్యలు తీసుకోలేదు. నివేదిక సరిగా లేదని ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో మరో కమిటీని నియమించింది. తాజాగా మరో ఘటనలో ఓ దళిత క్రీడాకారిని సీనియర్ విభాగంలో జాతీయస్థాయిలో పోటీల్లో పాల్గొంటే.. అధికారులు మాత్రం స్కూల్ గేమ్స్ విభాగంలో మాత్రమే ఆడినట్టు ప్రాధాన్యత పాయింట్లు ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థిని సీటు కోల్పోవాల్సి వచ్చింది.
నిజంగానే పనిఒత్తిడి ఉందా..?
ఈ విద్యాసంవత్సరం స్పోర్ట్స్కోటాలో 235 దరఖాస్తులు చేసుకోగా, వాటిలో 162మంది అర్హులుగా గుర్తించారు. నెలరోజుల సమయంలో వీరందరి సర్టిఫికెట్లను పరిశీలించి, కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి నివేదిక పంపించారు. దీనికి 9మంది సభ్యులతో పాటు ఇద్దరు సప్టోరింగ్ స్టాఫ్తో కూడిన కమిటీని వేశారు. టాప్ ఫైనల్ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన కోసం నలుగురితో మరోకమిటీ వేశారు. నిజంగా పని ఒత్తిడితో ఈపొరపాటు జరిగితే, మొదటి కమిటీ తప్పును గుర్తించకపోయి నా, ఫైనల్లిస్ట్ కమిటీ ఎందుకు గుర్తించలేదు అనేదానికి సమాధానం లేదు. కేవలం పదిమంది వివరాల్లోనూ సమగ్రంగా పరిశీలించకుండా ఉం డటాన్ని పనిఒత్తిడి అనుకోవాలా..? నిర్లక్ష్యంగా భావించాలా? అని బాధి తులు ప్రశ్నిస్తున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన కమిటిలో ఆరోపణలు ఉన్న వారి ని తీసుకోవద్దు. కానీ ఈ కమిటీలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి కీల కంగా ఉండటం గమనార్హం. అయితే తప్పు జరిగిందని కమిటీ నివేదిక ఇచ్చి న తర్వాత కూడా చర్యలు తీసుకోకపోవడానికి ప్రభుత్వంలోని ఒకరిద్దరు పెద్దల హస్తం ఉన్నట్టు సాట్స్లో ప్రచారం జరుగుతోంది. ఈనెల 24న ఇద్దరు సీనియర్ అధికారులతో వేసిన కమిటీ తన నివేదిక ఇవ్వనున్నది. దీనితోనైనా సర్కారు అక్రమార్కులపై చర్యలు తీసుకుంటుందా.? లేదా వారిని కాపాడే ప్రయత్నం చేస్తుందా? అనేది వేచిచూడాలి.