Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిజామాబాద్ప్రతినిధి
'అంగన్వాడీల కనీస వేతనాల కోసం మోడీని నిల దీద్దాం. అందుకు జూలైలో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్ట నున్నాం. దీనికి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు భారీగా తరలిరావాలి' అని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రధాన కార్యదర్శి ఎ.ఆర్. సింధు పిలుపునిచ్చారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ (సీఐటీయూ) యూనియన్ రాష్ట్ర ద్వితీయ మహా సభ ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైంది. మహాసభ ప్రారంభ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజీవ్గాంధీ ఆడిటోరియం వరకు సాగింది. ఈ ర్యాలీలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతరం రాజీవ్గాంధీ ఆడిటోరియంలో యూని యన్ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ అధ్యక్షతన సభ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎ.ఆర్.సింధు ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లయినా ఇప్పటికీ దేశంలో పోషకాహార లోపంతో ప్రతియేటా ఆర్నెల్లలోపు చిన్నారులు 20,400 మంది మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలు లేకపోతే ఈ నిష్పత్తి మరింత పెరిగేదని నిపుణులు హెచ్చరించినా ప్రభుత్వాలు పట్టించు కోక పోవడం దారుణమన్నారు. దేశంలో 16 కోట్ల మందిలో ఎనిమిది కోట్ల మంది పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు పోష కాహారం అందిస్తున్నాయని వివరించారు. శిశుమరణాలపై పార్లమెంటులో ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. జాతీయ మీడియా కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐసీడీఎస్కు పైసా కూడా కేటాయించలేదని చెప్పారు. ఐసీడీఎస్ను పీపీపీలో నడిపేందుకు కుట్ర జరుగుతోందని, వీటిని అక్షయపాత్ర, వేదంతా కంపెనీలకు ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారని అన్నారు. ఇందుకు రాష్ట్రంలోని కేసీ ఆర్ ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతోందని విమర్శిం చారు. అంగన్వాడీకి నిధులు కేటాయించాలనే సోయి లేని కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీల ఆదాయం మాత్రం పెంచుతోందని విమర్శించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం కింద పిల్లలకు ఒక్కొక్కరికి రూ.261 అకౌంట్లో వేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని అన్నారు. నగదు బదిలీ బదులు బడా కంపెనీల నుంచి ఆహార ప్యాకెట్లు పంపి ణీ చేయాలని కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ అంటున్నారని తెలిపారు. ఇదంతా బడా కంపెనీల నుంచి కమీషన్లు పొందాలనే ఉద్దేశమేనని చెప్పారు. అంగన్వాడీ లకు పెంచిన వేతనాలేమీ ప్రభుత్వాల సొంత సొమ్ముకాదని, ప్రజల డబ్బేనని స్పష్టం చేశారు. అంగన్వాడీల పక్షాన సీఐటీయూ రాజీలేని పోరాటాలు చేస్తోందన్నారు.
హక్కుల కోసం తిరగబడే వీరనారీమణులు :
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు
అంగన్వాడీలు హక్కుల కోసం తిరగబడే వీరనారీమణులని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు కొనియాడారు. తమ ప్రభుత్వం జీతాలు పెంచినప్పుడు సీఐటీయూకు సభ్యత్వం ఎందుకివ్వడమని మంత్రి హరీష్రావు అనడం కార్మిక సంఘాల హక్కులను కాలరాయడమేనన్నారు. హరీష్రావు సొంత భూములమ్మి వేతనాలు పెంచిండా..? లేక కేసీఆర్ ఫామ్ హౌజ్ భూము ల్లో పండించిన పంటకు వచ్చిన లాభాలతో పెంచిండా..? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం సభ్యత్వ డబ్బుల్లో అవకతకలు జరిగి జైలుకుపో యిన చరిత్ర మీదని, కార్మికుల హక్కుల కోసం పోరాడిన చరిత్ర సీఐటీయూదని గుర్తుచేశారు.
50 కోట్ల మంది జనాభాకు ఆరోగ్య రక్షణ కల్పిస్తామని చెప్పిన మోడీ బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెరిపిస్తామని చెప్పిన బోధ న్షుగర్స్, బిల్ట్ పరిశ్రమ, సిర్పూర్ కాగజ్నగర్ పరిశ్రమలకు ఇంత వరకు అతీగతీలేదని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అందులో 26 వేలు భర్తీ చేస్తే సగం పోలీసులే ఉన్నారన్నారు. పోలీసుల నిర్భందంతో ఆం దోళనలు ఆగవని స్పష్టం చేశారు. అంగన్వాడీల హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో సీఐటీయూ సమరశీల పోరాటాలకు ఈమహాసభల్లో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఒంగరి రాములు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.రమ, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి తదితరులు ప్రసంగించారు. ఈ సభలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్బాబు, అధ్యక్షుడు పల్లపు వెంకటేష్, కామారెడ్డి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు దేవగంగు, స్వర్ణ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.