Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కౌలు రైతు సంఘం సమావేశంలో టి. సాగర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెట్టుబడి పథకం కింద కౌలు, పోడు రైతులకు కూడా ఎకరానికి రూ. 4వేల చొప్పున ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్ ప్రభుత్వాన్ని కోరారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర సమావేశం మంగళవారం హైదరాబాద్లో నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్ర వరి 20నుంచి గ్రామ సభలు నిర్వహించి కమిటీలు ఏర్పాటు చేసి, నెలాఖరు వరకు మండల, జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించి, తహశీల్దార్లకు, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని పిలుపునిచ్చారు. మార్చి మొదటి వారంలో ధర్నాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 14లక్షల మంది కౌలుదారులు సాగు చేస్తున్నట్టు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) గుర్తించిందన్నారు. పంటలు పండించడానికి ఇచ్చేదే పెట్టుబడి రాయితీ పథకం అయినప్పుడు పండించే కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కౌలు రైతులే నష్టపోతున్నారని, ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి పరిహారం కూడా కౌలు రైతులకు కాకుండా భూయజమానులకు ఇవ్వడం అన్యాయమన్నారు. పోడు భూములు సాగు చేసే రైతులు కూడా ఈ పథకం వర్తింపజేయాలన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. జంగారెడ్డి అధ్యక్షత వహించగా, సంఘం ఉపాధ్యక్షు లు బొంతల చంద్రారెడ్డి, అరిబండి ప్రసాద్రావు, బండ శ్రీశైలం, మాదినేని రమేష్, యాదవరెడ్డి, సహా య కార్యదర్శులు వి. సంజీవరెడ్డి, లక్ష్మీ. నాగిరెడ్డి, నర్సింహులు, తిరుపతిరెడ్డి, వాసుదేవరెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎంపిక
తెలంగాణ కౌలు రైతు సంఘం నూతన కమిటీ ఎంపికైంది. రాష్ట్ర కన్వీనర్ వర్ణ వెంకట్రెడ్డి, కో కన్వీ నర్లుగా తాతా భాస్కర్రావు, ఆర్. వెంకట్రాములు, కమిటీ సభ్యులు టి.సాగర్, కర్నాటి హనుమంతరావు, తోటి పెద్ద వెంకట్రెడ్డి, బల్లిచిన్న వీరయ్య, ముత్తిలింగం, మున్యానాయక్, గొలి వెంకట్రెడ్డి, కుర్మసిద్ధులు, టేకు మల్లేశం, కనుగుల శ్రీను, గూడ వెంకట్రెడ్డి, మమత, రాజయ్య, శ్రీనివాస్, శ్రీధర్రెడ్డి, వి. శ్రీనివాస్, తిరపతి, ఎం. శ్రీనివాస్రెడ్డి, ఫఫీ, లక్ష్మయ్య ఎంపికయ్యారు.