Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకరుల సమావేశంలో భారత ప్రజాన్యాయవాదుల సంఘం
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
మావోయిస్టు ఆజాద్ జర్నలిస్టు హేమచందర్ పాండే ఎన్కౌంటర్ కేసులో ఈ నెల 15న ఆదిలాబాద్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి ఇచ్చిన తీర్పు పలు విధాలా ప్రాధాన్యమైనదని భారత ప్రజాన్యాయవాదుల సంఘం(ఐఏపీఎల్) తెలిపింది. మొట్టమొదటి సారిగా 6000లకు పై ఎన్కౌంటర్ హత్యలు జరిగిన తెలుగు రాష్ట్రాల్లో కోర్టు విచారణ ఈ స్థాయి వరకు చేరకున్న మొదటి కేసు ఇదేనని పేర్కొంది. ఒక సిఐ, మరో ఎస్ఐతో సహా మొత్తంగా 29 మంది స్పెషల్ పోలీసు పార్టీ మీద కోర్టుకు హాజరై న్యాయవిచారణకు ఎదుర్కోవాల్సింది అని తెలిపింది. మంగళవారం భారత ప్రజాన్యాయవాదుల సంఘం(ఐఏపీఎల్) ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో వరవరరావు, వెంకన్న, సురేష్కుమార్, రఘునాథ్, కె. పద్మ, లక్ష్మీదేవి కోర్టు తీర్పు వివరాలను వెల్లడించారు. సంచలనాత్మకమైన ఈ తీర్పుతో ఆదిలాబాద్ కోర్టులో ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో తొలి న్యాయవిచారణ ప్రారంభం కానుందన్నారు.