Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గవర్నర్,హోంమంత్రి, డీజీపీలను మర్యాద పూర్వకంగా కలిసిన సుధీప్
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ సుదీప్ లక్తాకియాను అత్యంత కీలకమైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) చీఫ్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్గా విదులను నిర్వహిస్తున్న సుధీప్లక్తాకియా 1984 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఎన్ఎస్జీ చీఫ్గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన మంగళవారం తన సొంత కేడర్ రాష్ట్రం తెలంగాణకు విచ్చేసి మంగళవారం గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ను రాజ్భవన్కు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్తో దాదాపు 45 నిమిషాల పాటు ఉన్నారు. అనంతరం ఆయన సచివాలయానికి వెళ్లి రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని కలిశారు. అక్కడి నుంచి నేరుగా డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సుధప్ లక్తాకియా పోలీసు చీఫ్ మహేందర్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్జీ చీఫ్గా నియమితులైన లక్తాకియాకు గవర్నర్, హోంమంత్రి, డీజీపీలతో పాటు పలువురు సహచర ఐపీఎస్ అధికారులు అభినందనలు తెలిపారు. గతంలో దాదాపు ఏడేండ్ల పాటు ఎన్ఎస్జీ ఐజీగా సుధీప్ బాధ్యతలను నిర్వహించారు. తిరిగి అదే విభాగానికి చీఫ్గా తనను నియమిం చడంతో తన బాద్యతలు మరింతగా పెరిగాయని ఆయన అన్నారు. ఆయనకు వచ్చే ఏడాది జూన్ వరకు సర్వీసు ఉంది.