Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విదేశాలకు మాంసం ఎగుమతి చేసేందుకు 100 ఎకరాల్లో కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మాంసం ఎగుమతి చేసేందుకు లూలూ అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చిందన్నారు. లూలూ సంస్థ ప్రతినిధులు సీఈవో సలీం, కో డైరెక్టర్ విజరుకుమార్లతో ఒప్పందం కుదిరినట్టు మంత్రి తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటుతో 800 మందికి ప్రత్యక్షంగా, 5వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలుంటాయని చెప్పారు. మాంసం ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా ఉన్నందున విదేశీ సంస్థలు ముందుకు రావాలని కోరారు.