Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగ విద్యార్థి జేఏసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కి అర్హత ఉన్నా పర్సెంటేజీల కారణంగా దరఖాస్తు చేసుకోలేని డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను ముఖ్యమంత్రి కేసీఆర్కు పంపించారు. మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మెన్ వి భీంరావునాయక్ మాట్లాడుతూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) నిబంధనలకు విరుద్ధంగా పర్సెంటేజీలను అమల్లోకి తేవడంతో కొందరు డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణులైనా వారి సర్టిఫికెట్లను విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2012 నుంచి డీఎస్సీ కోసం ఎదురుచూస్తుంటే పర్సెంటేజీల పేరుతో తెలంగాణ ప్రభుత్వం టీఆర్టీకి దూరం చేసిందని అన్నారు. ఎందుకూ పనికిరాని ఈ సర్టిఫికెట్లను ముఖ్యమంత్రి కేసీఆర్కు విరాళం పంపిస్తున్నామని చెప్పారు. సీఎం ఫాంహౌజ్లో కూలిపనిచేయడానికి పర్సెంటేజీల కారణంగా నష్టపోయిన 22 వేల మంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అన్ని అర్హతలున్నా పర్సెంటేజీల కారణంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గిరి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.