Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 140.10 కోట్లు ొ జీవో 131 జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో నుంచి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లరు కార్పొరేషన్ లిమిటెడ్(టీడీడబ్ల్యూఎస్సీఎల్) మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం తెచ్చిన రుణం, వడ్డీ చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.140.10 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు మిషన్ భగీరథ కార్యదర్శి స్మీతా సబర్వాల్ మంగ ళవారం ఆదేశాలు జారీచేశారు. ఈ నిధులతో హడ్కో నుంచి తెచ్చిన అసలు, వడ్డీని చెల్లిస్తారు. జీవో 162 ద్వారా ఇప్పటికే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్(బీఆర్వో) సైతం ఇప్పటికే విడుదల చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ బి.సురేందర్రెడ్డిని ఆదేశించారు.