Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 బ్రాంచ్ మేనేజర్లు మొదలు సిబ్బందిపై కేసులు నమోదు చేసిన సీబీఐ
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ గ్రామీణ బ్యాంకు మోయినాబాద్ అజిజ్నగర్ బ్రాంచ్లో 9 కోట్ల రూపాయలను దారి మళ్లించిన కుంభకోణంలో 11 మంది బ్యాంకు అధికారులు సిబ్బందిపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. సీబీఐ వర్గాలు తలెఇపిన వివరాల ప్రకారం 2010 నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఈ గ్రామీణ బ్యాంకు నుంచి దశల వారిగా ప్రైవేటు అక్కౌంట్లకు డబ్బులు బదిలీ అయ్యాయి.
ఈ విధంగా మొత్తం 8 కోట్ల 94 లక్షల రూపాయలు దారి మళ్లినట్టు తెలంగాణ గ్రామీణ బ్యాంకు రిజినల్ మేనేజర్ రవీందర్రెడ్డి గత ఫిబ్రవరి తొలి వారంలో సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ముఖ్యంగా ఆఫీస్ అసిస్టెంట్ ఎం.జైపాల్రెడ్డి ఈ కుంభకోణానికి సూత్రధారిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఈ బ్యాంకులో ప్రస్తుతం పని చేఉ్తన్న మేనేజర్ మొదలుకుని గతంలో పని చేసి ప్రస్తుతం వేరే బ్రాంచ్లలో పని చేస్తున్న మేనేజర్లు, అధికారులు 11 మందిపై కేసులను నమోదు చేశారు. సెక్షన్ 120బి,420, 468, 471, 477, 13 సబ్ సెక్షన్ 2 అవినీతి నిరోధక చట్టం క్రింద కేసులను నమోదు చేశారు. కాగా స్కాంకు పాల్పడిన వారిలో బ్యాంకు ఆఫీస్ అసిస్టెంట్ జైపాల్రెడ్డి, మేనేజర్ జె.మోజెస్, బ్రాంచ్ మానేజర్ కె.లక్ష్మీనర్సయ్య, కె.చంద్రయ్య, జి.శ్రీనివాస్రావు, ప్రస్తుత బ్రాంచ్మేనేజర్ ఈ.రాజన్న, ఎలిమినేడు బ్రాంచ్ మేనేజర్ బి.రవికాంత్, రిటైర్డు అధికారి వివిజె రామారావు, అక్కౌంటెంట్ గురుప్రసాద్, పార్ట్టైమ్ స్వీపర్ ఎం.శ్రీనివాస్రెడ్డిలు ఉన్నట్టు పేర్కొంటు వీరిపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఇప్పటికే వీరిలో కొందరిని అదుపులోకి తీసుకుని సీబీఐ అధికారులు విచారిస్తున్నట్టు తెలిసింది. గత ఎనిమిదేండ్లుగా ఈ కుంభకోణం ఈ బ్యాంక్లో నిరాటంకంగా సాగిపో యిందని, ఈ విషయంలో సదరు బ్యాంకు మేనేజర్లు మొదలుకుని క్రింది స్థాయి సిబ్బంది వరకు అందరు పథకం ప్రకారం కుమ్మక్కయ్యారని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసు దర్యాప్తు సాగుతున్నదని తెలిపాయి.