Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ గురుకుల విద్యాసంస్థల్లో ప్రకటించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) పోస్టుల తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ వాణీప్రసాద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురుకుల పీజీటీలో సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. 2017, డిసెంబర్ 30న గురుకుల పీజీటీ ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీజీటీలో 921 పోస్టులకు 838 మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఆప్షనల్ సబ్జెక్టులు (మ్యాథమెటిక్స్, బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్)ల్లో 513 పోస్టులకు 475 మంది అభ్యర్థులను ఎంపికయ్యారు. ఇందులో 126 మ్యాథమెటిక్స్ పోస్టులకు 114 మంది, 22 బయలాజికల్ సైన్స్ పోస్టులకు 21 మంది, 177 సోషల్ స్టడీస్ పోస్టులకు 166 మంది, 188 ఫిజికల్ సైన్స్ పోస్టులకు 174 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆప్షనల్ సబ్జెక్టుల్లో అర్హులైన అభ్యర్థుల్లేక 38 పోస్టులకు ఎంపిక చేయలేదు. పీజీటీ భాషాపండితుల సబ్జెక్టుల్లో 408 పోస్టులకు 363 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ముగ్గురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ఫలితాల్లో మూడు పోస్టులకు మార్పులు జరిగాయని తెలిపారు. ఆ మూడు పోస్టులను మినహాయించి మిగిలిన పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశామని పేర్కొన్నారు.