Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం తీర్పు నేపధ్యంలో ఆరువారాల్లో
- కావేరి మేనేజ్మెంట్ బోర్డు,
- రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు
- రాష్ట్రాల మధ్య జలజగడాలు
- జాతీయ అభివృద్ధికి ఆటంకం :
మీడియా సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ
సహాయ మంత్రి అర్జున్ మేఘావాల్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రాల మధ్య జలజగడాలను పరిష్కరించటానికి జాతీయ స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించినట్టు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘావాల్ తెలిపారు. మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే రెండవ విడత బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇకపై జాతీయ స్థాయిలో ఒకే ట్రిబ్యునల్ పనిచేస్తుందని, రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునళ్లు ఉండవని వివరించారు. మంగళవారం ఇక్కడి జరిగిన దక్షిణా ది రాష్ట్రాల జలవనరుల సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాల జలవనరుల తొలి సమావేశం జయప్రదంగా ముగిసిందని చెప్పారు. నదుల వారీగా ట్రిబ్యునళ్లు ఉంటే డబ్బు వృథా అవుతుందని, కాలయా పన జరుగుతున్నదని అన్నారు. తమిళనాడు-కర్నాటకల మధ్య జలవి వాదాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ఆరు వారాల్లో కావే రి మేనేజ్ మెంటు బోర్డు, కావేరి రెగ్యులేటర్ అథారిటీని ఏర్పాటు చేస్తు న్నామని కేంద్రమంత్రి ప్రకటించారు. రాష్ట్రాలలో సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు పెంచుతామని, నాబార్డు వంటి సంస్థలు, లేదా ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు మంజూరు చేయిస్తామని తెలియజే శారు. దక్షిణాది రాష్ట్రాల జలవనరుల సమావేశం హైదరాబాద్ డిక్లరేషన్ గా పిలవవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య జలజగ డాలు జాతీయ అభివృద్ధికి ఆటంకమని ఇక వీటికి చరమగీతం పాడాలని హితవు చెప్పారు.
కోర్టులు, ట్రిబ్యునళ్ల వల్ల కాలయాపన, వృథా ఖర్చు జరుగుతోందనిచెప్పారు. ఏండ్ల తరబడి జాప్యం వల్ల సమస్య మరింత జటిలమవుతుందని అన్నారు. సమస్య ఎంత త్వరగా పరిష్కారమైతే అంత త్వరగా అభివద్ధికి వీలవుతుందని తెలిపారు. ఈ సదస్సు రొటీన్ సమావేశం కాదన్నారు. ఇందులో చేసే తీర్మానాలతో జలవివాదాల పరిష్కారం దిశగా రోడ్ మ్యాప్ సిద్ధమవుతుందని కేంద్ర మంత్రి అన్నారు. జలవివాదాల పరిష్కారం ప్రధాని ప్రాధాన్యతల్లో ఒకటన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి, ఆయా సమస్యల ముగింపునకు గాను కార్యాచరణ ఖరారుకు తనను కేంద్ర జలవనరుల మంత్రి గడ్కరీ పంపారని తెలిపారు. జలవివాదాలు సత్వరం పరిష్కరిం చాలని ప్రధాని కోరుతున్నట్టు అర్జున్ రామ్ చెప్పారు. సంక్లిష్టమైన వ్యవ హారాలను ఇంకా జటిలం చేయొద్దని ఆయన దక్షిణాది ఇరిగేషన్ మంత్రు లు, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.