Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని 73మందితో ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా సీహెచ్ భారతి (కామారెడ్డి), రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎం పద్మ (సిద్దిపేట), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పి జయలక్ష్మి(హైదరాబాద్) ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 18,19 తేదీల్లో జరిగిన యూనియన్ రాష్ట్ర మహా సభలు జరిగాయి. ఈ సందర్భంగా యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర కోశాధికారిగా కె నర్సమ్మ(మెదక్), ప్రచార కార్యదర్శిగా త్రివేణి(ఆసిఫాబాద్), సాంస్కృతిక కార్యదర్శిగా బి కోటేశ్వరి(ఖమ్మం) ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా జి జ్యోతి(పెద్దపల్లి), బి శోభారాణి(మేడ్చల్), కె సునీత(ఆదిలాబాద్), జి పద్మ (భద్రాద్రి కొత్త గూడెం), పి మంగ (సంగారెడ్డి), కవిత (వనపర్తి), ఝాన్సీ(భూపాలపల్లి), వీణ(మినీవర్కర్-మెదక్), ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా హేమలత (సిద్దిపేట), మీనా(హైదరాబాద్ సౌత్), కవిత(రంగారెడ్డి), ఏకలక్ష్మి (సూర్యపేట), లలిత(నిర్మల్), వాణి(హైదరాబాద్ సెంట్రల్) ఎన్నిక య్యారు.