Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజమో కాదో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ నిర్వహిస్తున్న శిశు సంరక్షణ గహాల్లో శిశు మరణాల సంఖ్య గణనీయంగా ఉందనేది నిజమో కాదో చెప్పాలని తెలంగాణ సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ నిర్వహణలోని శిశు మందిరాల్లో మరణాలు బాగా ఉన్నాయని, శిశు విక్రయాలు కూడా జరుగుతున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ బాలల హక్కుల సంఘ ఫౌండర్ ప్రెసిడెంట్ అచ్యుతరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరిపింది.
హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా శిశు మందిరాల్లో పిల్లలు మ తి చెందుతున్నారని పిటిషనర్ లాయర్ చెప్పారు. నల్లగొండ జిల్లాల్లోనే ఏడాది కాలంలో 32 మంది మ త్యువాతపడ్డారని, మొత్తం 40 మంది వరకూ చనిపోయారని చెప్పారు. ఇంతమంది పిల్లలు చనిపోయారా.. చనిపోతే అందుకు బాధ్యత వహించాల్సిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు.. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని తెలంగాణను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి కె.విజయలక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశించింది.
ప్రభుత్వ భూమిపై అప్పులు తీసుకోవడమా?
మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ భూమి రెండు వేల ఎకరాలపై బ్రీఅతీవేటు వ్యక్తులు అప్పులు తీసుకున్నారని తెలుసుకున్న హైకోర్టు విస్తుపోయింది. సర్కార్ భూమికి పట్టాలు తీసుకోవడమే కాకుండా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడంపై పూర్తి వివరాలు అందజేయాలని తెలంగాణ సర్కార్ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి కె.విజయలక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.
భూబాగోతంపై గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇందూరి రామ్మోహనరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని మంగళవారం బెంచ్ విచారణ జరిపింది. గొల్లపల్లి,మైలారం, జోగాపూర్, ఘనాపూర్, ఖర్గీ, పుప్పలవానిపేట, నెన్నెల, మన్నెగూడెం, కమ్మపల్లి గ్రామాల్లో రెండు వేల ఎకరాల భూబాగోతం వెనుక పాలక పెద్దలు, అధికారులు, ప్రజాప్రతినిధుల హస్తం ఉందని పిటిషనర్ లాయర్ చెప్పారు. భూములకు బోగస్ పట్టాలు అందుకుని తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి అప్పులు తీసేసుకున్నారని చెప్పారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ను బెంచ్ ఆదేశించింది.