Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11న అమరారం జాతరలో కిడ్నాప్
- రెండు రోజుల పాటు 11 మంది అఘాయిత్యం
- ఆలస్యంగా వెలుగులోకి...
నవతెలంగాణ-పినపాక
గిరిజన యువతిని కిడ్నాప్ చేసి రెండ్రోజుల పాటు 11 మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన భధ్రాద్రి కొత్తగుడెం జిల్లా పినపాక మండలం జానంపేట పంచాయతీ పరిధిలోని అమరారంలో జరిగింది. శనివారం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వివరాల ప్రకారం..జానంపేట పంచాయతీ పాండు రంగాపురం గ్రామానికి చెందిన యువతి ఈ నెల 11న అమరారంలో నిర్వహించిన తల్లుల జాతరకు వెళ్లింది. అమరారం గ్రామానికి చెందిన పొలేబోయిన భరత్, ఏసుబాబుతో పాటు మరో 9 మంది యువకులు యువతిని ఆటోలో బలవంతంగా లాక్కొని తీసుకెళ్లారు. అమరారం అడవుల్లో సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత మరునాడు భూపాలపల్లి జిల్లా అఖినపల్లి మల్లారం అడవుల్లో మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం వదిలి వెళ్లారు. ఈ నెల 14వ తేదీ వరకూ తన బిడ్డ ఇంటికి రాకపోవడంతో ఏడూళ్లబయ్యారం పోలీస్ స్టేషన్లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. అయితే, యువతి శనివారం ఇంటికి చేరుకొని తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లికి తెలిపింది. ఇదే విషయమై ఏడూళ్ల బయ్యారం ఏఎస్ఐ లక్ష్మినారాయణను వివరణ కోరగా ఈ నెల14న సదరు యువతి కనబడుట లేదని ఫిర్యాదు అందిందని, కేసు విచారణలో ఉందని తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు.