Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత
- దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా అరెస్ట్
- ప్రతి కార్మికుడినీ పర్మినెంట్ చేయాలి: పాలడుగు భాస్కర్
నవతెలంగాణ- విలేకరులు
మూడు రోజులు తమ సమస్యలపై సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులను శనివారం పలు చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం కలెక్టరేట్ ముట్టడిగా బయలుదేరిన కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. నాయకులను అరెస్టు చేస్తుండగా తోపులాట జరిగింది. రాస్తారోకో, దిష్టిబొమ్మలు దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సీఎం హామీ మేరకు వేతనాలు పెంచి, ప్రతి కార్మికుడినీ పర్మినెంట్ చేయాలని, ఉద్యోగులతో సమానం వేతనాలివ్వాలని గజ్వేల్లో కార్మికుల సమ్మెలో పాల్గొన్న మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్ పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు.
ఖమ్మంలో సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులంతా కలిసి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను, కార్మికులను అరెస్టులు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. అరెస్టుల సందర్భంగా స్వల్ప తోపులాట జరిగి ఉద్రిక్తత ఏర్పడింది.
మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు సభ నిర్వహించిన సభలో జేఏసీ చైర్మెన్ పాలడుగు భాస్కర్ ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న కార్మికులది ఆకలి, ఆత్మగౌరవ పోరాటమని అన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు వెళ్తుండగా పోలీసులు కార్మికులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఐటీయూ నాయకులు మల్యాల గోవర్ధన్ను అరెస్టు చేయబోగా కార్మికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కష్ణ మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులపై పోలీసులను ఉసిగొల్పి ఉద్యమాన్ని అణచివేయాలని చూడటం దుర్మార్గమన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోడ్డుపైనే కార్మికులు వంటావార్పు నిర్వహించారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాస్తారోకో చేశారు. వేములవాడ, కరీంనగర్లో కార్మికుల సమ్మెకు పలు రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పోరేషన్ ఎదుట ధర్నా, అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చారు. పెద్దపల్లిలో మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. జగిత్యాలలో కార్మికుల ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ టి.విజయలకీë జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైటాయించారు.
సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, జోగిపేట నగర పంచాయతీ కార్మికులు సమ్మె కొనసాగింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ, ధర్నా చేశారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ధర్నా అనంతరం ఉప తహసీల్దార్ ఎగ్బాల్కు వినతిపత్రం అంద జేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో కార్మికులు చిప్పలు పట్టుకుని నిరసన తెలిపారు. జోగులాంబ జిల్లా కేంద్రంలో కార్మికులు అర్ధనగ ప్రదర్శన చేశారు.
నల్లగొండ మున్సిపల్ కార్యాలయం ఎదుట సమ్మెకు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కార్మికులు కండ్లకు గంతలు కట్టుకుని జాతీయ రహదారిపై అర్ధనగ ప్రదర్శన చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపైనే వంటావార్పు చేసుకున్నారు.